రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను గవర్నర్కు అంద జేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర గీతం, వేడుకలపై చర్చించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. రేపు పరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్ బండ్పై అవతరణ వేడుకలను నిర్వహించేం దుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పరేడ్ గ్రౌండ్స్లో సన్నాహక కవాతు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించి అనంతరం వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరుకానున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్లో జరిగే వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. అక్కడే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్నారు.
గవర్నర్తో సమావేశమైన రేవంత్, భట్టి
0
138
Previous article
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


