ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. బిలియనీర్ల ప్రయోజనాల కోసమే ఆయన పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గొడ్డా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు విపక్ష కూటమి పోరాడుతుంటే, బీజేపీ మాత్రం దాన్ని చెత్తబుట్టలో పడేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాను చూపెడుతున్న రెడ్బుక్లో రంగు ముఖ్యం కాదు, అందులో ఉన్న కంటెంట్ ముఖ్యం అని అన్నారు. తాము రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతున్నామని తెలిపారు. కులం, మతం ఆధారంగా విద్వేషాలతో సమాజాన్ని విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్
0
251
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


