స్వతంత్ర వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో ఈ జంట ఒకరు. ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉపాసనకు ఓ ఊహించని బహుమతి అందింది. ఆ గిఫ్ట్ను ఆమె సోషల్మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన సోషల్మీడియా ఇన్స్టాలో తమ బిడ్డ కోసం చేయించిన ఊయల గురించి పలు విశేషాలను షేర్ చేశారు. తమకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రజ్వలా ఫౌండేషన్ సంస్థ ఓ ప్రత్యేకమైన ఊయలను కానుకగా ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఊయల ప్రాముఖ్యతను దాన్ని తయారుచేసిన విధానాన్ని వివరించారు.సెక్స్ ట్రాఫికింగ్లో చిక్కుకొని బయటపడిన మహిళలకు.. ప్రజ్వల ఫౌండేషన్ ఉపాధితో పాటు ఆశ్రయం కల్పిస్తోంది. వారిలోని కొందరు మహిళలే ఈ ఊయలను తయారు చేశారని ఉపాసన చెప్పారు. వారు తయారు చేసిన ఈ ఊయల.. ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. “అతి త్వరలో మేం ముగ్గురం కాబోతున్నాం. నా బిడ్డ కోసం మీరు చేతితో తయారు చేసి ఇచ్చిన ఈ ఊయల ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుందని భావిస్తున్నాను. ఇది వారిలోని ధైర్యం, బలం, ఆత్మగౌరవం ఆశకు ప్రతీకగా నా బిడ్డకు గుర్తుండిపోతుంది. మా అందమైన ప్రయాణంలో అంతర్భాగమైనందుకు ప్రజ్వల ఫౌండేషన్కు ప్రత్యేక కృతజ్ఞతలు” అని ఉపాసన రాసుకొచ్చారు.
ఉపాసనకి బహుమతిని అందచేసిన ప్రజ్వల ఫౌండేషన్
0
350
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


