తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని రాయిపేట, ఇందిరానగర్లలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాయిపేట, ఇందిరానగర్లను చుట్టు ముట్టడంతో అక్కడున్న ప్రజలు ఏం జరుగుతుందోనని అర్థం కాని అయోమయానికి గుర య్యారు. సరైన పత్రాలు లేని 40 వాహనా లను పట్టుకోవడంతోపాటు అనుమానాస్పద ప్రాంతాలలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా గంజాయి, మరణాయు ధాలు, పెట్రోలు, డీజిల్, బాణా సంచాలపై ప్రత్యేకంగా జల్లెడ పట్టారు.