24.7 C
Hyderabad
Monday, March 24, 2025
spot_img

పాటకి స్వరం అందించిన ప్రధాని

స్వతంత్ర వెబ్ డెస్క్: భారత ప్రతిపాదన మేరకు ఈ ఏడాదిని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని పురస్కరించుకొని తృణధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రపంచానికి తెలియజేయడం కోసం గ్రామీ అవార్డు విజేత, ప్రముఖ భారత-అమెరికన్‌ గాయని ఫాల్గుణి షా (ఫాలు) ఓ ప్రత్యేక పాటను రూపొందించారు. అయితే ఫాల్గుణి కోరిక మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ పాటకి తన గాత్రాన్ని అందించారు. ‘Abundance in Millets’ పేరుతో ఫాలు, ఆమె భర్త గౌరవ్‌ షా ఈ పాటను శుక్రవారం విడుదల చేశారు. ఇంగ్లిష్‌, హిందీలో ఉన్న ఈ పాటను ఫాలు దంపతులతో కలిసి ప్రధాని మోదీ రచించారు. గీతం మధ్యలో మోదీ స్వయంగా పలికిన మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తృణధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకలి సమస్యను ఎలా నిర్మూలించొచ్చన్నది ఈ పాట రూపంలో తెలియజేసే ప్రయత్నం చేశారు. . దాదాపు 130కి పైగా దేశాల్లో చిరుధాన్యాలను పండిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ మంది వీటిని సంప్రదాయ ఆహారంగా పరిగణిస్తారు. ప్రధానితో కలిసి పాటను రచించడం చాలా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లో ఈ పాటను రాశామని, త్వరలోనే దీన్ని ఇతర ప్రాంతీయ భాషాల్లోకి అనువాదం చేయనున్నట్లు ఆమె తెలిపారు.

Latest Articles

శిథిలాలయంగా బనగానపల్లె ఆయుర్వేద వైద్యాలయం-కిటికిటీలకు అద్దాలు అమరిస్తే కొత్త భవనం రెడీ-మీనమేషాల లెక్కింపుతో కాలహరణం

కొత్త వింత కావచ్చు, కాని పాతని రోతగా చూడ్డం ఏం సబబు.. ఏ కొత్తయినా పాతనుంచే పుడుతుంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ప్రజలపాలిట ఆరోగ్యప్రదాయినిలా ఉండే ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి శిథిల భవనంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్