ఖమ్మం జిల్లాలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఓవైపు వానదే వుడు కరుణించ క ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతులకు అటు వానదేవుడు కరుణించడం లేదు. ఇటు బోర్ల ద్వారా అయినా సాగునీటి ని తోడుకుందామంటే కనెక్షన్లు ఇవ్వని పరిస్థితితో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు.
ఖమ్మం జిల్లాలో రైతులకు విద్యుత్ కష్టాలు తప్పడం లేదు. కరెంట్ ఆఫీసర్ల తీరుతో విసిగిపోయిన అన్నదాతలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. మోటార్లకు కనెక్షన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహిరి స్తున్నారంటూ అగ్గి మీద గుగ్గిలంలా మండిపడతున్నారు. మంత్రులు ఎన్ని సార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు అధికారులు. ఆదిలోనే హంసపాదం వేస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉన్నప్పటికీ, విద్యుత్ అధికా రుల తీరు మాత్రం మారడం లేదని ఫైర్ అవుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో ఎక్కడ కూడా విద్యుత్ శాఖ అధికారు లతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదు. అలాగే అధికారులు కూడా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై శ్రద్ద చూపడం లేదని రైతులు, రైతు సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, వైరా, ఖమ్మం, ఖమ్మం రూరల్ నాలుగు విద్యుత్ డివిజన్లు ఉన్నాయి. వీటిలో డీఈల పర్యవేక్షణలో ఏడీఈ, ఏఈలు ఉంటారు. మండలంలో ఏడీఈలు అందు బాటులో ఉండి ఏఈలతో సమన్వయం చేసుకుంటూ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఖమ్మం జిల్లాలో పనితీరు అలా సాగడం లేదు. నాలుగు డివిజన్లలో పని చేసే డీఈలు, ఏడీఈలు, ఏఈలు కొందరు స్ధానికంగా అందుబాటులో ఉండటం లేదని ఆరోపిస్తున్నారు రైతన్నలు. విద్యుత్ శాఖ అధికా రులు స్దానికంగా అందుబాటులో ఉండకపోవడంతోనే వ్యవసాయ కనెక్షన్ల్ పూర్తిస్ధాయిలో పరిశీలిం చలేక పోతు న్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తగినంత వర్షపాతం లేకపోవడంతో రైతులు విద్యుత్ కనెక్షన్లపై ఆధారపడ్డారు. ఈ క్రమంలోనే విద్యుత్ కనెక్షన్ల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
ఎన్సీడీసీఎల్ సంస్ధ పరిధిలోని 4 డివిజన్లలో 2 వేల 649 మంది అన్నదాతలు విద్యుత్ కనెక్షన్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఖమ్మం నగరంలో 766, వైరా 323, సత్తుపల్లి 518, ఖమ్మం రూరల్ 579 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. రైతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే అధికారులు క్షేత్రస్ధాయిలో పరిశీలించి ఎస్టీమేటేడ్ వేయాలి. కానీ ఇప్పటి వరకూ ఆ ప్రక్రియ పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారు అధికారులు. వచ్చిన 2 వేల 186 దరఖాస్తుల్లో ఎంత మందికి ఎస్టిమేటేడ్ వేశారో అనే డేటా కూడా పర్యవేక్షణ సర్కిల్ కార్యాలయంలో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వ్యవసాయ కనెక్షన్లపై అధికారులు ఎంత శ్రద్దగా పనిచేస్తున్నారో అర్ధమవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఖమ్మం రూరల్ మండలంలో అత్యధికంగా నెలకొండపల్లిలో 251, ఖమ్మం నగర పరిధిలో 766 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలో ఈ దరఖాస్తులు వచ్చాయని అధికా రుల లెక్కలు చెబుతున్నాయి. దరఖాస్తులు వస్తున్నా అసలు ఎందుకు ఎస్టీమేడేట్ వెయ్యడంలేదని నిలదీస్తున్నారు. దీనిపై జిల్లా అధికారి ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి త్వరితగతిన కనెక్షన్లు ఇచ్చి పంటల సాగుకు సహకరించాలని కోరుతున్నారు.మరి అన్నదాత ఆవేదనను అర్థం చేసుకుని ఇకనైనా అధికారులు నిర్లక్ష్యా న్ని వీడుతారా..? లేదంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారా.? అదే జరిగితే ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడాలి.