జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మార్చి 30న పిఠాపురంలో ప్రారం భమైన వారాహి యాత్ర ఇవాళ మూడో రోజు కొనసాగనుంది. ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ పిఠాపురం రానున్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి గొల్లప్రోలుకి హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడ పవన్ సమక్షంలో టీడీపీ నేతలు మండలి బుద్ద ప్రసాద్, నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరనున్నారు. వారికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించనున్నారు. అవనిగడ్డ, పాలకొండ సీట్లను జనసేన పెండింగ్లో పెట్టింది. అవనిగడ్డ నుంచి మండలి, పాలకొండ నుంచి నిమ్మక పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.