39.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

DA Hike |కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు డిఎ పెంపు.. ఎంత శాతం పెరిగిందంటే..

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం 4 శాతం పెంచుతూ(DA Hike) కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 38 శాతం ఉన్న ఉద్యోగుల డిఎ 42 శాతానికి పెరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్రమంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే ఉద్యోగుల డిఎ పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు కోటి మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం వెల్లడించింది. ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.12,815 కోట్ల రూపాయల భారం పడుతుందని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. పెంచిన డిఎ(DA Hike) ఈ ఏడాది జనవరి 1వ తేదీనుంచి వర్తిస్తుందని తెలిపింది. 2022 సెప్టెంబర్‌లో చివరగా కేంద్రం డిఎను సవరించింది. ఏడాదిలో రెండు సార్లు డిఎ సవరించడం జరుగుతుంది.

Read Also:  గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వారికి రాయితీ కొనసాగింపు..

Follow us on:   Youtube   Instagram

Latest Articles

రంజుగా మారిన కామారెడ్డి క్యాంపు రాజకీయాలు

    కామారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీ రాజకీయం రసవత్తరంగా.. యమరంజుగా సాగుతోంది. అవిశ్వాసమా... రాజీనామా అన్న ఆసక్తి నెలకొంది. నమ్మిన బంటుల్లా ఉన్న వారంతా దొడ్డిదారిన ఈ గట్టు నుంచి ఆ గట్టుకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్