నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా వేడుకలకు రావాల్సిందిగా ఒక్కొక్కరిని ఆహ్వానిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమ తాజాగా నేషనల్ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ ని కలిసింది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ అనుపమ రెడ్డి, మా అసోసియేషన్ నుండి మాదాల రవి, శివ బాలాజీ, నిర్మాత ముత్యాల రామదాసు తదితరులు వెళ్లి అల్లు అర్జున్ను ఆహ్వానించారు. అల్లు అర్జున్ సానుకూలంగా స్పందిస్తూ బాలకృష్ణతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తాను తప్పక వస్తానని చెప్పారు.
బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు అల్లు అర్జున్కు ఆహ్వానం
0
367
Previous article
Next article
Latest Articles
బీజేపీలోకి నిజంగానే వలసలు ఉండబోతున్నాయా? లేదంటే ఇది మైండ్ గేమా?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అధికార పోరు అప్పుడే తారాస్థాయికి చేరింది. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ ప్రత్యర్థులపై...
- Advertisement -
- Advertisement -


