ఏపీలో పోలీసుల తీరుపై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. పోలీస్ అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదన్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల్వాయి గేట్లో విధ్వంసం జరిగితే పోలీసులకు పట్టలేదని విమర్శించారు. ఈవీఎంను ధ్వంసం చేస్తే 13నే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. డీజీపీకి అందిన సిట్ నివేదికలో ఎక్కడా పిన్నెల్లి ప్రస్తావనే లేదని చెప్పారు. లోకేశ్ ట్వీట్ చేస్తే ఈసీ చర్యలకు ఆదేశిస్తుందా అని నిలదీశారు.