గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థపై సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి సీతక్క. ప్రస్తుతం అమలవుతున్న స్కీములు, బడ్జెట్ లో ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల కేంద్ర నిధులను వినియోగించుకోలేకపోయామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను మంజూరు చేస్తే.. కేంద్రం నుంచి మరిన్ని నిధులను రాబట్టుకోవచ్చని అధికారులు మంత్రికి సూచించారు. కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు మంత్రి సీతక్క.