అధికార పార్టీ నేతల తీరుతో ఒక్కోసారి పోలీసులు కూడా ఇబ్బందులు పడుతుంటారు. అధికారం ఉంది కదా? అని ఖాకీలను లెక్క చేయకుండా వ్యవహరిస్తుంటారు నేతలు. తాజాగా ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. మచిలీపట్నం పర్యటనకు వెళ్లిన మంత్రి రోజాను అధికారులు ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో మంత్రి జోగి రమేశ్ డీఎస్పీ మాసుం భాషా పట్ల దురుసుగా ప్రవర్తించారు. రోజాను ఆహ్వానించేందుకు ఎస్పీ జాషువా వెళ్తుండగా.. పక్కనున్న వారిని పక్కకు జరిపేందుకు డీఎస్పీ ప్రయత్నించారు. పొరపాటున జోగి రమేశ్ కు ఆయన చేయి తగలడంతో పక్కకు పో అంటూ డీఎస్పీపై కోపం ప్రదర్శించారు. డీఎస్పీ క్యాడర్ అధికారి పట్ల మంత్రి వ్యవహరించిన తీరుపై పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులంటే అధికార పార్టీ నేతలకు లెక్కలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
డీఎస్పీపై దురుసుగా ప్రవర్తించిన మంత్రి జోగి రమేశ్
0
405
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


