31.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

డీఎస్పీపై దురుసుగా ప్రవర్తించిన మంత్రి జోగి రమేశ్

అధికార పార్టీ నేతల తీరుతో ఒక్కోసారి పోలీసులు కూడా ఇబ్బందులు పడుతుంటారు. అధికారం ఉంది కదా? అని ఖాకీలను లెక్క చేయకుండా వ్యవహరిస్తుంటారు నేతలు. తాజాగా ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. మచిలీపట్నం పర్యటనకు వెళ్లిన మంత్రి రోజాను అధికారులు ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో మంత్రి జోగి రమేశ్ డీఎస్పీ మాసుం భాషా పట్ల దురుసుగా ప్రవర్తించారు. రోజాను ఆహ్వానించేందుకు ఎస్పీ జాషువా వెళ్తుండగా.. పక్కనున్న వారిని పక్కకు జరిపేందుకు డీఎస్పీ ప్రయత్నించారు. పొరపాటున జోగి రమేశ్ కు ఆయన చేయి తగలడంతో పక్కకు పో అంటూ డీఎస్పీపై కోపం ప్రదర్శించారు. డీఎస్పీ క్యాడర్ అధికారి పట్ల మంత్రి వ్యవహరించిన తీరుపై పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులంటే అధికార పార్టీ నేతలకు లెక్కలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్