లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 23న వరంగల్ లో పర్యటిస్తారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ తెలిపారు. బాలసముద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ రేపు నామి నేషన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు. నామినేషన్ కు ముందు ర్యాలీలో పెద్దఎత్తున పాల్గొనాలని దాస్యం వినయ్ భాస్కర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 23న వరంగల్, వర్ధన్నపేట నియోజకవర్గాల పార్టీ సమావేశాలకు కేటీఆర్ హాజరవుతారని సుధీర్ కుమార్ తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన ఆరూరి రమేష్, కడియం కావ్యం ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలని బిఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ పేర్కొన్నా రు.కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్ని విధాలుగా నష్టం చేసిందన్నారు.