నిర్మల్ జిల్లా భైంసాలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫిర్యాదు దాఖలైంది. ఎన్నికల సందర్భంగా గురువారం బీఆర్ ఎస్ రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ అక్కడ హనుమాన్ స్వాములు నిర్వహి స్తున్న నిరసన పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిరసన ఆపుతారా లేదా అంటూ పోలీసులను ఉద్దే శించి “పోలీసులు ఉన్నారా! చచ్చిపోయారా.! .మీకు చేత కాదా” అని మండిపడ్డారు. కేటీఆర్ పోలీసుల పై అనుచిత వ్యాఖ్యలుచేశారని ఆరోపిస్తూ భైంసా అడ్వకేట్లు బీజేపి నాయకులు తాడివార్ సాయినాథ్, ప్రవీణ్ కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ కి ఫిర్యాదు చేశారు.