సీఎం రేవంత్రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డినీ జైల్లో ఎందుకు పెట్టకూడదు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తన బంధువుకు వెయ్యి కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ మాట్లాడుతున్నాడని అన్నారు. సచివాలయంలో నిజాం ఆభరణాలను తాను తవ్వినట్లు రేవంత్ రెడ్డి నకిలీ కథనాన్ని సృష్టించాడని మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేయించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ దుయ్యబట్టారు. సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీ ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేశారని ఆరోపించారు. ఇలాంటి ఫేక్ న్యూస్ పెడ్లర్ అయిన సీఎం రేవంత్ రెడ్డినీ జైల్లో ఎందుకు పెట్టకూడదు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.