ఆముదాలవలస ఎమ్మెల్యేగా 30వేల మెజార్టీతో విజయం సాధించిన కూన రవికుమార్కు చంద్రబాబు కేబినెట్లో స్థానం కల్పించాలని న్యాయవాది కూన రాజారావు డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూన రవికుమార్ జిల్లా సమస్యలపై పోరాటం చేశారన్నారు. టీడీపీ అధికారంలో లేనప్పుడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పోలీసులు వేధింపులకు గురిచేసినా కార్యకర్తలకు అండగా నిలిచార న్నారు. జిల్లాలోని సామాజిక వర్గాలతో కూన రవికుమార్కు స్నేహబంధాలున్నాయని చెప్పారు. కూన రవికుమార్ లాంటి పోరాటపడిన కలిగిన నాయకుడికి చంద్రబాబు కేబినెట్ లో స్థానం కల్పించి గౌరవిం చాలని కోరారు. కేబినెట్లో అవకాశం లేకుంటే స్పీకర్ పదవి అయినా ఇచ్చి గౌరవించాల న్నారు.