సీమను తెలంగాణలో కలపాలని జేసీ సంచలన వ్యాఖ్యలు

రాయలసీమను తెలంగాణలో కలపాలని మాజీ మంత్రి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా కలిపితేనే రాయలసీమ నీటి సమస్య తీరుతుందని తెలిపారు. రాయలసీమను కలుపుకోవాల్సిన అవసరం తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉందన్నారు. రాయల తెలంగాణ కావడానికి ఎవరికీ అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. ఎన్నికల తర్వాత నేతలందరిని కలుస్తానని తెలిపారు జేసీ. రాష్ట్రాలను విడగొట్టడం కష్టం కానీ.. కలపడం సులభమన్నారు. ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

కాగా గతంలో రాష్ట్ర విభజన సమయంలోనూ రాయల తెలంగాణ అనే డిమాండ్స్ వచ్చాయి. కొంతమంది సీమ కాంగ్రెస్ నేతలు దీనిపై పోరాటం కూడా చేశారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఇన్నాళ్ల తర్వాత మళ్లీ రాయల తెలంగాణ అంశం జేసీ తెరపైకి తీసుకురావడం సంచలనంగా మారింది.

 

Latest Articles

జనగణనలో ఓబీసీ కాలమ్ లేకపోవడంపై వివాదం

జనగణనలో కులగణన అంశం ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తోంది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్