31.2 C
Hyderabad
Thursday, September 28, 2023

నేడు మచిలీపట్నంలో జనసేన 10వ వార్షిక ఆవిర్భావ సభ

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జనసేన(Janasena) 10వ వార్షిక ఆవిర్భావ సభ జరుగనుంది. బందరు శివారులో పొట్టి శ్రీరాములు పేరుతో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ సభా ప్రాంగణం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేటి మధ్యాహ్నం విజయవాడ నుంచి వారాహి వాహనంలో పవన్‌ కల్యాణ్‌ బయల్దేరనున్నారు. పార్టీ వార్షిక ఆవిర్భావ సభ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి పవన్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, పవన్ కల్యాణ్ నిన్న రాజ్ భవన్ లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు.ఈ సమావేశంలో పవన్ వెంట జనసేన(Janasena) పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. సుమారు గంట పాటు గవర్నర్ తో వీరి భేటీ జరిగింది. ప్రస్తుతం రాజకీయాలు, రాష్ట్ర పరిస్థితులు, తాజా పరిణామాలపై పవన్ కల్యాణ్ గవర్నర్ తో చర్చించారు.

Read Also: నేడు ఢిల్లీలో వై.ఎస్. షర్మిల ధర్నా

Follow us on:   Youtube   Instagram

Latest Articles

కోటి 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ.. బాలాపూర్‌ రికార్డు బ్రేక్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో ఖైరతాబాద్ ఎంత ఫేమస్సో బాలాపూర్ లడ్డు కూడా అంతే ఫేమస్. ఈ లడ్డూ ప్రతీసారి లక్షల్లో ధర పలుకుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్