ఏపీలో మద్యం విధానంపై మాట్లాడే హక్కు మాజీ సీఎం జగన్కు లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ధన దాహంతో ఏపీని నాశనం చేశారని విమర్శించారు. మద్యం, ఇసుకలో దోపిడీ అంటూ జగన్ ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగిన మద్యం విధానంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో కల్తీ మద్యం తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారన్నారు. అక్రమాలకు అడ్డురావొద్దనే ఎక్సైజ్శాఖను జగన్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు కొల్లు రవీంద్ర.