రైతుల మధ్య విభేదాలు సృష్టించి వైసీపీ విధ్వంసం చేయాలని చూస్తోందని మంత్రి నారాయణ ఆరోపించారు. అమరావతిపై వైసీపీ కమిటీలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయో ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. భవనాలు, రోడ్లు, పైపులైన్ల నిర్మాణం పూర్తయ్యాక భూములు ఇవ్వడం సాధ్యమేనా అని మంత్రి ప్రశ్నించారు. మాజీ సీఎంగా చేసిన వ్యక్తిగా అవగాహన లేకుండా ఎలా మాట్లాడతారని మంత్రి నారాయణ ప్రశ్నించారు. రాజధానిలో ట్రంక్ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ట్రంక్ రోడ్లు 43, ఎల్పీఎస్ జోన్లలో 32 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామన్నారు. వర్షాకాలంలో కొండవీటి వాగు ప్రవాహానికి ఇబ్బంది లేకుండా మట్టిని తొలగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శాఖమూరు, పెనుమాక, నీరుకొండ రిజర్వాయర్లలో సగం పని పూర్తయ్యిందని వివరించారు.
అమరావతిపై వైసీపీ కమిటీలు వేయడం హాస్యాస్పదం- మంత్రి నారాయణ
0
55
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


