మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. రహస్యప్రదేశంలో ప్రణీత్రావును విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ఐబీలోని హార్డ్డిస్క్ల ధ్వంసం, రికార్డుల మాయం వ్యవహారంలో ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. SIBలో కీలకంగా పనిచేసిన మాజీ IPS ప్రభాకర్ రావు పాత్రపై ప్రణీత్ రావును విచారిస్తున్నారు. అయితే పోలీసుల విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. ప్రణీత్ రావ్ సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రీట్రీవ్ చేయనున్నారు. ప్రణీత్ రావు కేసును సీఐడీకి లేదా సిట్కు బదిలీ చేసే అవకాశం ఉంది. ప్రణీత్ రావు అరెస్ట్ను ఆయన కుటుంబ సభ్యులు తప్పుబట్టారు. కాగా పంజాగుట్ట పోలీసులు మాత్రం ప్రణీత్ రావును తాము అరెస్ట్ చేయలేదని చెబుతున్నారు.