రాయదుర్గంలో నకిలీ పోలీస్ను మాదాపూర్ SOT పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ పరిధిలో గత కొన్ని రోజులుగా బ్యూటీ పార్లర్ల యజమానులను క్రైం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నకిలీ గుర్తింపు కార్డ్ చూపించి బెదిరిస్తూ మరికొండ సాయి కిరణ్ రాజు అధిక మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారు. నింది తుడిపై పోలీసులు నిఘా పెట్టారు. అదే క్రమంలో రాయదుర్గంలోని ఓ సెలూన్ యజమానిని బెదిరించి 10వేలు తీసుకుని బయటకు వస్తున్న సమయంలో సాయి కిరణ్ తేజను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి 10వేల నగదు, ఒక సెల్ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకు న్నారు.