పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు… రేవంత్ రెడ్డిపై కేసు నమోదు

స్వతంత్ర వెబ్ డెస్క్: టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) పోలీస్ కేసు(Police Case) నమోదు అయింది. మ‌హ‌బూబ్ న‌గ‌ర్(Mahabub Nagar) జిల్లా పోలీసుల‌పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ప‌లు పోలీసు స్టేష‌న్లలో కేసులు న‌మోదు అయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమంది నేతలు హైదరాబాద్ లోని గాంధీభవన్(Gandhi Bhavan) వేదికగా కాంగ్రెస్(Congress) లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కడిని గుడ్డలూడదీసి కొడతానని పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కొంతమంది పోలీసుల పేర్లను తన డైరీలో రాసి పెట్టుకుంటున్నానని తెలిపారు.

 

రేవంత్ వ్యాఖ్యల‌ను పోలీసు అధికారుల అసోసియేష‌న్‌లు ఖండిస్తున్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నా చట్టానికి లోబడి పనిచేస్తామన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఇకనైనా పోలీస్ వ్యవస్థను విమర్శించే అలవాటు మానుకోవాలని పోలీసు అసోసియేష‌న్లు సూచించాయి. రేవంత్‌ రెడ్డిపై భూత్పూర్, జడ్చర్ల పోలీస్ స్టేషన్ ల‎లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Latest Articles

2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు

2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్