25.2 C
Hyderabad
Tuesday, October 3, 2023
spot_img

సింగరేణి కార్మికులకు భారీగా బోనస్.. అక్షరాలా ఎంతో తెలుసా..?

స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్(CM KCR) గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఉద్యోగులకు ఉత్తమ పీఆర్సీ(PRC) ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ గోల్గొండ కోటపై(Golgonda Fort) జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఉద్యోగులకు పీఆర్సీ, సింగరేణి కార్మికులకు(Singareni workers) బోనస్(bonus) వంటి వరాలు కురిపించారు. ఉద్యోగుల సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం మిగతా రాష్ట్రాల కన్నా ముందుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యోగులే దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్నారని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ ఇచ్చామన్నారు. ఇప్పటివరకూ రెండు సార్లు పీఆర్సీల ద్వారా 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చామని సీఎం తెలిపారు. కరోనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించినా ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్‌ అందిచామన్నారు. త్వరలోనే నూతన పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతామన్నారు. అప్పటివరకూ మధ్యంతర భృతిని చెల్లిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

Latest Articles

టీడీపీలో ఉత్కంఠ.. రేపు ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్న నారా లోకేశ్

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ యువనేత నారా లోకేశ్ రేపు ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. సీఆర్పీసీ 41ఏ కింద సెప్టెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్