మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం

హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు నిర్వాసితుల ఇళ్లను మార్కింగ్ చేస్తున్నాయి. అయితే మూసీ నది పరివాహక ప్రాంతంలో సర్వే కోసం వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు ఖాళీ చేయమని కొత్తపేట, మారుతీనగర్, సత్యానగర్ వాసులు తేల్చి చెప్పారు. సర్వే నిర్వహిస్తున్న పత్రాలను చించివేసి, గోడలకు పెయింట్ వేయనివ్వకుండా అడ్డుకున్నారు.

ఇక హైదరాబాద్ పాతబస్తీ బహదూర్‌పురా నియోజకవర్గంలో మూసి నది రివర్ బెడ్‌లో ఉన్న ఇళ్ల వివరాలు తీసుకొని రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని పలు ప్రాంతాలలో రెవెన్యూ అధికారులు 5 టీంలుగా ఏర్పడి పోలీసుల సహాయంతో సర్వే చేస్తున్నారు. దాదాపు 386 ఇండ్లు మూసి రివర్ బేడీలోకి వస్తున్నాయని తెలిపారు. రివర్ బెడ్ లో వచ్చే అన్ని ఇండ్లలో ఉంటున్న మొత్తం 386 ఇళ్ల వివరాలు సేకరిస్తున్నారు. బహదూర్‌పురా పోలీసులు ఎలాంటి అవంచనియా జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Latest Articles

పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు

తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందేనని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్