సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని, రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన నడుస్తోందని అన్నారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం ముందుగా మేలుకుంటే ప్రాణనష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేదని తెలిపారు. వరద బాధితులకు సాయం చేయడానికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వెళ్తే దాడి చేసి కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్రావు విమర్శలు
0
154
Next article
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


