రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ, కంటోన్మెంట్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 పార్లమెంటు స్థానాలకు బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగ నుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ పెంచేందుకు రేపు రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజ్ గిరిలో 3226 పోలింగ్ కేంద్రాలు 1లక్ష 9వేల 941 బ్యాలెట్ యూనిట్లు, 44వేల 906 కంట్రోల్ యూనిట్లు ఏర్పాట్లు
చేశారు.