ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉదయం నుంచే సిబ్బం ది నియోజకవర్గంలోని డిస్ట్రబ్యూషన్ సెంటర్లకు చేరుకున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా పలాసలో తెల్లవారు జాము నుంచే ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. భారీ గాలులతో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ ఏర్పా ట్లు ఆగి పోయాయి. వేసిన టెంట్లు నేలకొరడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.