ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డయేరియా విజృంభిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో డయేరి యా బారినపడి నలుగురు, నంద్యాల జిల్లాలో ఒకరు, కాకినాడ జిల్లాలో మరొకరు మృత్యువా తపడ్డారు. మూడు జిల్లాల్లోనూ 85 మందికి పైగా బాధితులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతు న్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన కొందరు డయేరియా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులు వాంతులు, విరోచనాలతో జగ్గయ్యపేట, విజయవాడ ప్రభుత్వాస్ప త్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో 19 మంది డయేరియా బాధితు లకు వైద్యసిబ్బంది చికిత్సలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వ స్పత్రి లో చికిత్స పొందుతున్న బాధితులను పరామ్శించారు.
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతులపాడు శివారు చాబోలులో శుక్రవారం 30 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారిలో కొంతమంది నందికొట్కూరు, కర్నూలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం మరో నలుగురు వాంతులు, విరేచనాలతో నీరసించి పోయారు. వారిలో నడిపి నాగన్న అనే వ్యక్తిని నందికొట్కూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించగా.. కొద్దిసేపటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని జొన్నలదొడ్డి ప్రాంతంలో డయేరియా వ్యాపించింది. గ్రామంలో ఈ నెల 19న డయేరియా కేసు గుర్తించారు. అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోకపోవడంతో బాధితుల సంఖ్య 36కు పెరిగింది. ఆరుగురిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో కొమ్మోజు సత్యవేణి అనే మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కాకినాడ ఆర్డీవో ఇట్ల కిషోర్, డీఎంహెచ్వో జె.నరసింహ నాయక్, డీపీవో సౌజన్య శనివారం వేట్లపాలెంలో పర్యటించారు. జొన్నలదొడ్డి, వేట్లపాలెం పీహెచ్సీలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.