ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విరుచుకుపడ్డారు. 25 ఏళ్లుగా ఆ పార్టీకి ఢిల్లీలో అధికారం దక్కలేదు కాబట్టే ఇక్కడి ప్రజలపై బీజేపీ ద్వేషం పెంచుకుందని విమర్శించారు. అందుకే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని భారతదేశానికి నేర రాజధానిగా మారుస్తోందని ఘాటు విమర్శలు చేశారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, గ్యాంగ్వార్లు నిత్యకృత్యమైన నేపథ్యంలో మహిళలు ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటేనే వణికిపోతున్నారని అన్నారు.