స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. నిత్యావసర పదార్థాలను కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నగర శివారు కాటేదాన్ పారిశ్రామికవాడలో కుళ్లిపోయిన అల్లం, పాడైపోయిన వెల్లుల్లిలకు రసాయనాలు కలిపి అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారుచేస్తున్నారు. ఈ కల్తీ దందాపై సమాచారం అందడంతో సైబరాబాద్ SOT పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.
కల్తీ అల్లంవెల్లుల్లి పేస్టుతో పాటు మ్యాంగో కూల్డ్రింక్ తయారుచేస్తున్నట్లు గుర్తించారు. అల్లంవెల్లుల్లి పేస్ట్ బాగా ఘాటుగా ఉండేందుకు అసిటిక్ యాసిడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారు. అంతేకాకుండా తయారీలో మురుగు నీటిని కూడా వాడుతున్నట్లు తేలింది. ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు,, 500 కేజీల అల్లంవెల్లుల్లి పేస్టు, లిటిల్ చాప్స్ కూల్డ్రింక్స్, 210లీటర్ల అసిటిక్ యాసిడ్, 550 కేజీల నాన్ వెజ్ మసాలా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు.