స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 82,582 మంది భక్తులు దర్శించుకున్నారు. 43,586 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.19 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నేటితో తిరుమల శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ గరుడ వాహనంపై ఉరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంకు శ్రీవారి ఊరేగింపు జరుపుతారు.