కాంగ్రెస్ ఏడాది పాలనలో గుండె దిగులుతో రైతన్నలు కాలం వెల్లదీస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో నింపుకున్న వెలుగులు… ఏడాది కాంగ్రెస్ పాలనలో మటుమాయం అవుతున్నాయంటూ విమర్శించారు. పాలమూరులో పల్లికి, వైరాలో మిర్చికి మద్దతు ధర కోసం, బయ్యారంలో కరంటు కోసం, జగిత్యాలలో యూరియా కోసం రైతన్నలు ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు ఎదురుచూపులే మిగిలాయని చెప్పారు. రైతుబంధు కోసం, రైతుబీమా, రుణమాఫీ, కరెంటు, యూరియా, సాగునీటి, పంటల కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఏడాది పాలన.. ఎదురుచూపుల పాలన అంటూ విమర్శించారు. ఎట్లుండె తెలంగాణ.. ఎట్లైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.