CM KCR Delhi Tour | జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ సత్తాను చాటేందుకు.. ఢిల్లీలో గులాబీ జెండాను ఎగురవేసేందుకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మే 4వ తేదీన ఢిల్లీలోని వసంత విహార్ లో నిర్మించిన BRS జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో రెండు రోజుల ముందే ఢిల్లీకి వెళ్లనున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో మే 2న ఢిల్లీకి చేరుకోనున్నారు. అనంతరం అక్కడే ఉన్న రాజకీయ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. అయితే సీఎం కేసీఆర్ మూడు, నాలుగు రోజులు అక్కడే ఉండనున్నారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో ఎవరెవరిని కలుస్తారు? ఏ విషయాలపై చర్చిస్తారన్న దానిపై రాజకీయవర్గాల్లో ఉత్కంఠగా మారింది.
ఢిల్లీకి సీఎం కేసీఆర్… రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
0
302
Previous article
Latest Articles
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యల దుమారం
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని మహేశ్కుమార్ గౌడ్ ఆరోపిస్తే... కాదు రేవంత్ రెడ్డే క్షుద్రపూజలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ కౌంటరిచ్చారు. వర్షాలు పడకూడదని,...
- Advertisement -
- Advertisement -


