24.7 C
Hyderabad
Monday, October 2, 2023

బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

సీఎం కేసీఆర్(CM KCR) పార్టీ కార్యకర్తలకు ఆత్మీయ సందేశం పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం మాత్రమే బాగుంటే సరిపోదని.. దేశం మొత్తం బాగుండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో దేశం కోసం ముందుకు పోదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 14 ఏళ్లు సుదీర్ఘంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం.. అనుకున్న విధంగానే ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నామన్నారు.

నాడు కరువుతో అల్లాడిన తెలంగాణ.. నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నదని పేర్కొన్నారు. నాడు మనం భయపడితే తెలంగాణ వచ్చేదా? సాహసమే ఊపిరిగా సాగుతున్న ప్రయాణంలో.. మీరే నా బలమని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన బీఆర్ఎస్(BRS) పై బీజేపీ బరితెగింపు దాడులు చేస్తోందన్నారు. ఇది ఎన్నికల సంవత్సరం.. నిరంతరం ప్రజల్లో ఉండాలని.. పనికిమాలిన పార్టీల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశం కోసం జరిగే పోరాటాలు అన్నింటిలో ధర్మమే జయిస్తుంది అని కేసీఆర్(CM KCR) ఆత్మీయ సందేశాన్ని ఇచ్చారు.

Read Also: వివేకా హత్య కేసు దర్యాప్తు జాప్యంపై సుప్రీం సీరియస్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

సంక్రాంతి బరిలో లైకా ప్రొడక్షన్స్ ‘లాల్ సలాం’

అగ్ర హీరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్. ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
290FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్