స్వతంత్ర, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్టీఆర్ భవన్ కు రానున్నారు. రెండోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఎన్టీఆర్ భవన్ కి వస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, పలువురు రాష్ట్ర నాయకులు చంద్రబాబును సన్మానించనున్నారు. అనంతరం తెలంగాణ నేతలతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ టిడిపి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ మధ్య ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలని కలసిన చంద్రబాబు.. బిజెపితో పొత్తుతో ముందుకు వెళితే ఏ విధంగా ఉంటుందనే దానిపై రాష్ట్ర నాయకులతో చర్చించే అవకాశం కనిపిస్తుంది.