కాంగ్రెస్ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి భద్రాచలం బీఆర్ ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరవడం చర్చనీ యాంశమైంది. ఇల్లందులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మహబూబాబాద్ పార్ల మెంటు సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ సమావేశానికి భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నా మీటింగ్ లో పాల్గొనడంపై చర్చ జరుగుతోంది. తెల్లం వెంకట్రావు త్వరలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారం జరుగు తున్న నేపథ్యంలోనే ఆయన ఈ మీటింగ్ కు హాజరయ్యారు. గతంలో మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి తెల్లం వెంకట్రావు చేరే అవకాశం ఉంది.