లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ… బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తూ… పలు సూచనలు చేస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలను రచి స్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 13న చేవెళ్లలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. చేవెళ్ల సభా స్థలిని పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, కాలే యాదయ్య తదితరులు పరిశీలించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని.. అధికారంలోకి వచ్చి వందరోజులు గడిచిన ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు.