రాష్ట్రంలో కరువును, రైతులను ప్రతిపక్ష నాయకులు రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్లో సర్దార్ సర్వాయి పాపన్న వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రైతుల సమస్యల పేరుతో దీక్ష చేస్తున్న బండి సంజయ్ ఢిల్లీలో ప్రధాని ముందు దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం మొన్నటి దాకా రాముని ఫోటో పెట్టుకొని..ఇపుడు రైతుల పేరిట మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. కాలేశ్వరం కుంగిపోతే సలహాలు ఇవ్వకుండా నాలుగు నెలలుగా మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
0
205
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


