బీజేపీది అధర్మ ఎన్నికల యుద్ధమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్కు చెందిన 270 కోట్లు బ్యాంక్ ఖాతాలను స్తంభింప జేసి… అందులో నుంచి 135 కోట్లు స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. బీజేపీ చేతిలో ఐటీ, ఈడీ, సీబీఐలు కీలు బొమ్మలన్నారు. ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థి పార్టీలను ఆర్థికంగా దెబ్బతీయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పాలని తులసి రెడ్డి పిలుపునిచ్చారు.