AP Assembly |ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం నెలకొన్న వేళ… స్పీకర్ తమ్మినేని సీతారం టీడీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ రూలింగ్ చేశారు. పోడియం దగ్గరికి వస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్ అన్నారు. టీడీపీ సభ్యులపై స్పీకర్ సీరియస్ అవుతూ.. నేను గౌతమబుద్ధుడిని కానని అన్నారు. టీడీపీ సభ్యుల తీరు అత్యంత అవమానకరమని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించారు. ఘర్షణ అనంతరం ప్రారంభమైన అసెంబ్లీలో బెందాళం అశోక్, అచ్చం నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ, మంతెన రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, డోల బాల వీరాంజనేయ స్వాములను స్పీకర్ సభ నుంచి ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు.


