RRR కస్టోడియల్ టార్చర్ పై సీబీఐకి హైకోర్టు కీలక ఆదేశాలు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సీఐడీ అధికారులు తనను చిత్రహింసలకు గురిచేశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రఘురామను సీఐడీ అదుపులోకి తీసుకున్న సమయంలో తక్షణమే కాల్ డేటా సేకరించాలని CBI అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. టెలికాం నిబంధనల ప్రకారం రెండేళ్ల వరకు కాల్ డేటా ఉంటుందని.. ఈ కేసులో కాల్ డేటా ఎంతో కీలకమని  రఘురామ తరఫు న్యాయవాది నౌమీన్ వాదించారు.

ఇక సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ హరినాథ్ వాదిస్తూ ఈ కేసు FIR సీఐడీ వద్దనే ఉంది కాబట్టి కాల్ డేటా కూడా సీఐడీ అధికారులే సేకరించాలని తెలిపారు. సీబీఐ న్యాయవాది వాదనలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో పిటిషనర్ ఆరోపణలు చేసింది సీఐడీ అధికారుల మీద అయితే కాల్ డేటా సేకరించాలని వారిని ఎలా ఆదేశిస్తామని ప్రశ్నించింది. మరోవైపు కాల్ డేటా సేకరించాలని చెప్పడం చట్టవిరుద్ధమని సీఐడీ ఇంప్లీడ్ పిటిషన్ వేసింది. తదుపరి విచారణను వేసవి సెలవులు అనంతరం చేపడతామని న్యాయస్థానం పేర్కొంది.

 

Latest Articles

మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..

హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్