24.7 C
Hyderabad
Monday, March 24, 2025
spot_img

RRR కస్టోడియల్ టార్చర్ పై సీబీఐకి హైకోర్టు కీలక ఆదేశాలు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సీఐడీ అధికారులు తనను చిత్రహింసలకు గురిచేశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రఘురామను సీఐడీ అదుపులోకి తీసుకున్న సమయంలో తక్షణమే కాల్ డేటా సేకరించాలని CBI అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. టెలికాం నిబంధనల ప్రకారం రెండేళ్ల వరకు కాల్ డేటా ఉంటుందని.. ఈ కేసులో కాల్ డేటా ఎంతో కీలకమని  రఘురామ తరఫు న్యాయవాది నౌమీన్ వాదించారు.

ఇక సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ హరినాథ్ వాదిస్తూ ఈ కేసు FIR సీఐడీ వద్దనే ఉంది కాబట్టి కాల్ డేటా కూడా సీఐడీ అధికారులే సేకరించాలని తెలిపారు. సీబీఐ న్యాయవాది వాదనలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో పిటిషనర్ ఆరోపణలు చేసింది సీఐడీ అధికారుల మీద అయితే కాల్ డేటా సేకరించాలని వారిని ఎలా ఆదేశిస్తామని ప్రశ్నించింది. మరోవైపు కాల్ డేటా సేకరించాలని చెప్పడం చట్టవిరుద్ధమని సీఐడీ ఇంప్లీడ్ పిటిషన్ వేసింది. తదుపరి విచారణను వేసవి సెలవులు అనంతరం చేపడతామని న్యాయస్థానం పేర్కొంది.

 

Latest Articles

శిథిలాలయంగా బనగానపల్లె ఆయుర్వేద వైద్యాలయం-కిటికిటీలకు అద్దాలు అమరిస్తే కొత్త భవనం రెడీ-మీనమేషాల లెక్కింపుతో కాలహరణం

కొత్త వింత కావచ్చు, కాని పాతని రోతగా చూడ్డం ఏం సబబు.. ఏ కొత్తయినా పాతనుంచే పుడుతుంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ప్రజలపాలిట ఆరోగ్యప్రదాయినిలా ఉండే ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి శిథిల భవనంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్