ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆయన సర్వీసును పొడిగిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. నీరభ్ కుమార్ ప్రసాద్ ఈ నెల మొదటి వారంలో ఏపీ సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం ఈ నెలాఖరులో ముగియనుంది. అయితే, ఏపీ ప్రభుత్వం ఆయన సేవలు కొనసాగించాలని భావించి సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ముఖ్య మంత్రి చంద్రబాబు అభ్యర్థన మేరకు తాజాగా సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ సీఎస్ నీరబ్కుమార్ పదవీకాలం పొడిగింపు
0
221
Previous article
Next article
Latest Articles
రికార్డులు తిరగరాయడం టీడీపీకే సాధ్యం- చంద్రబాబు
వర్చువల్ మహానాడు చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడు సందేశమని చెప్పారు. తెలుగు ప్రజల గుండెచప్పుడు ఎన్టీఆర్ అని.. NTRకు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం...
- Advertisement -
- Advertisement -


