బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగలనుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ వాషౌట్ కానుంది.15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మరో 15 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. మంత్రి కొండా సురేఖతో సంప్రదింపులు జరిపారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువాలు కప్పుకొనున్నారు. కొండా ఆపరేషన్ ఈస్ట్ సక్సెస్ అయింది. కొండా మురళి వ్యూహం ఫలించింది. కార్పొరేటర్ మరుపల్లి రవి, డిప్యూటీ మేయర్ భర్త రిజ్వానా షమీం మసూద్, కార్పొరేటర్ సురేష్, బసవరాజు శ్రీమాన్ తోపాటు రామ తేజస్విని భర్త తోట శిరీష్ చేరికను కొండా మురళి ధృవీకరించారు.