లడ్డూని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా హిందూ సంఘాల నేతలు. లడ్డూ వివాదం నేపథ్యంలో అమలాపురంలో భారీ ర్యాలీ నిర్వహించాయి హిందూ ధార్మిక సంస్థలు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని పలు ప్రధాన వీధుల గుండా సాగింది. దీంతో అమలాపురం గోవింద నామ స్మరణతో మారు మోగింది. ర్యాలీకి ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. లడ్డూ ప్రసాదం కల్తీ చేసిన వారిని శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ మళ్లించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హిందూ సంఘాల ర్యాలీ
0
321
Previous article
Next article
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


