అద్వానీకి భారతరత్న ప్రదానం

    బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ భారత అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అవార్డు అందుకున్నారు. ఆదివారం నాడు అద్వానీ ఇంటికి స్వయంగా వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఈ అవార్డును ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, హోంమంత్రి అమిత్ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనారోగ్య కారణాలతో.. శనివారం (మార్చ్-30) రాష్ట్రపతి భవన్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి అద్వానీ హాజరుకాలేదు. దీంతో రాష్ట్రపతి స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందజేశారు. శనివారం నలుగురికి భారతరత్న అవార్డులను అందజేశారు. మాజీ ప్రధా నులు దివంగత పివి నరసింహారావు, దివంగత చౌదరి చరణ్ సింగ్ తో పాటు.. వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత ఎంఎస్ స్వామి నాథన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కార్పూరీ ఠాకూర్ ల వారసులకు భారతరత్న అవార్డులను అందజేశారు. ఈ ఏడాది ఐదుగు రికి భారతరత్న అవార్డులు ప్రకటించింది.

Latest Articles

కృష్ణానదికి సీఎం చంద్రబాబు జలహారతి

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో కృష్ణానదికి సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. పవిత్ర సంగమం దగ్గర జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు . ఫెర్రీ వద్ద గంగమ్మకు చీరె, సారె సమర్పించారు. KL...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్