ఛాలెంజింగ్ స్టార్, కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ సంచలనం రేపింది. రేణుక స్వామి హత్య కేసులో ఆయనను మైసూ ర్లో అరెస్ట్ చేశారు. ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసింది. హత్య కేసులో ఆరోపణలు రావడం. వెంటనే కేసు నమోదు చేయడంతోపాటు అరెస్ట్ కూడా చకచక జరిగిపోయాయి. హీరో దర్శన్ తన అభిమానిని హత్య చేశాడనే ఆరోప ణలతో అరెస్టవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఘటనా స్థలానికి దర్శన్ తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఈ కేసులో తవ్వేకొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.
హీరో దర్శన్ వైవాహిక జీవితం కొంతకాలంగా సవ్యంగా సాగడం లేదు. అందుకు నటి పవిత్ర గౌడతో దర్శన్ సాన్నిహిత్య మే కారణమనే ప్రచారం ఉంది. పవిత్ర గౌడ కన్నడ సినీ పరిశ్రమలో నటిగా, ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్నారు. 2016 సంవత్సరంలో కన్నడ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. బెంగళూరు లో రెడ్ కార్పెట్ స్టూడియో పేరుతో ఫ్యాషన్ డిజైనర్ స్టూడియోను నిర్వహిస్తోంది. కన్నడ సినిమా పరిశ్రమలో ఆమె డిజైనింగ్కు మంచి పాపులారిటీ ఉంది. దశాబ్ద కాలంగా పవిత్ర గౌడకు హీరో దర్శన్కు సన్నిహిత సంబంధాలున్నాయి. పవిత్ర గౌడ కూతురు బర్త్ డేకు దర్శన్ హాజరు కావడంతో వారి మధ్య బంధం వెలుగులోకి వచ్చింది. వారిద్దరి వ్యవహారంపై గత కొద్దికాలంగా కన్నడ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారమే రేణుక స్వామిని కదిలించింది. దర్శన్కు వీరాభిమాని అయిన రేణుక స్వామి తన అభిమాన హీరో తన భార్యకు అన్యాయం చేయడంపై రేణుక స్వామి బహి రంగ వ్యాఖ్యలు చేశారు. దర్శన్, పవిత్ర తీరును తప్పుపట్టారు. పవిత్ర గౌడపై రేణుక స్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దర్శన్ ఓ దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
పవిత్రగౌడను వేధిస్తున్న రేణుకా స్వామిపై ఆగ్రహించిన దర్శన్ తన ఫ్యాన్స్ క్లబ్కు చెందిన రాఘవేంద్ర, కార్తీక్, కేశవ మూర్తిని సంప్రదించాడు. తమ అభిమాన హీరోనే తమ వద్దకు వచ్చి సాయం అడగటంతో వారు కూడా దానికి ఆనం దంగా ఒప్పుకున్నారు. దీంతో సుపారీ కింద దర్శన్ తొలుత వారికి 5 లక్షలు ఇచ్చాడు. తన పేరు బయటకు రాకూడదని, వారు అరెస్టయితే అవసరమైన లీగల్ ఖర్చులు కూడా భరిస్తానని చెప్పాడు. దీంతో ఈ నెల 8న రేణుకా స్వామిని అతని ఇంటి సమీపంలో అడ్డగించిన దర్శన్ అభిమానులు అతడిని కామాక్షి పాల్యలోని ఒక షెడ్లోకి తీసుకెళ్లారు. అక్కడికి వచ్చిన దర్శన్ బెల్టుతో స్వామిని చితకబాదాడు. తర్వాత దర్శన్ అభిమానులు కూడా అతడిని విపరీతంగా కొట్టడంతో స్వామి మరణించాడు. దీంతో ఈ విషయాన్ని నిందితులు దర్శన్కు తెలియజేసి, పరిస్థితిని చక్కదిద్డడానికి మరో 25 లక్షలు తీసుకున్నారు. రేణకా స్వామి మృతదేహాన్ని ఒక మురుగు కాల్వలో పడేశారు. అభిమాని హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ హీరో దర్శన్ తూగుదీప్ను విచారణ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లారు పోలీసులు. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న దర్శన్ సన్నిహితురాలు పవిత్ర గౌడను కూడా పట్టన గెరెకు తీసుకెళ్లారు. నిఖిల్, వినయ్, కార్తీక్, రాఘవేంద్ర సహా దర్శన్ సహచరులను కూడా ముందుగా అక్కడికి తీసుకెళ్లి తనిఖీ చేశారు. ఈ కేసులో ఓ మహిళ సహా మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.