స్వతంత్ర టీవీ ఎఫెక్ట్తో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని సాయిబాబా రెస్టారెంట్కు ఫుడ్ సెప్టీ అధికారుల బృందం రంగంలోకి దిగింది. సాయిబాబా రెస్టారెంట్ హోటల్లో మండి బిర్యానీ తిని 8 మంది కుటుంబ సభ్యులు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో స్వతంత్ర టీవీలో ప్రసారమైన కొద్ది గంటల్లోనే ఫుడ్ సేఫ్టీ అధికా రుల బృందం రంగంలోకి దిగింది. రంగారెడ్డి జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి ఉదయ్ కిరణ్ బృందం సాయి బాబా హోటల్ను తనిఖీ చేసి, బిర్యానీ శాంపిల్స్ను సేకరించారు. వంటగది పరిశుభ్రంగా లేకపోవ డంతో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.