మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మూడు కేసుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. కౌంటింగ్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు. మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి కోర్టు బెయిల్ ఇవ్వడంతోపాటు జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది. తర్వాత పిన్నెల్లిపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. మొత్తం నాలుగు కేసులు ఉన్నాయి. ఒక దాంట్లో ముందస్తు బెయిల్ వచ్చింది. మిగిలిన మూడు కేసులపై నిన్న విచారణ జరిగింది. మే 13న అల్లర్లకు కేసుకు సంబంధించి పిన్నెల్లిపై తాజాగా మూడు కేసులు నమోదయ్యాయి. పాల్వాయి గేట్ వద్ద బూత్ నెంబర్ 202లో టీడీపీ ఏజెంట్ పై గొడ్డలితో దాడి, కారంపూడిలో సీఐపై దాడి, పాల్వాయి గేట్ బూత్ నెంబర్ 202 వద్ద నాగశిరోమణి అనే మహిళపై దాడి జరిగింది. ఈ మూడు ఘటనలకు సంబంధించి పిన్నెల్లిపై మూడు కేసులు నమోదు కాగా.. బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.